సమైక్యమంటున్న బీజేపీ.. ఇక్కడెందుకిలా??
ఇదీ చదవండి: T Bill may come to discussion on Monday
హైదరాబాద్: రాజకీయాల్లో ద్వంద్వ వైఖరులు.. దొంగ వైఖరులు సర్వ సాధారణమే. అయితే బీజేపీ కూడా అదే కోవలో పయనిస్తోందా? ‘రన్ ఫర్ యూనిటీ’ అంటూ ఆదివారం దేశవ్యాప్తంగా సమైక్య పరుగు నిర్వహించింది ఈ కాషాయ పార్టీ. మరి దేశవ్యాప్తంగా దేశం సమైక్యంగా ఉండాలంటున్న బీజేపీ.. ఒక్క ఆంధ్రప్రదేశ్ విషయంలో మాత్రం రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేయడానికి తాము మద్దతిస్తామని ఎందుకు చెబుతోంది? ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండగా తెలంగాణ ఇవ్వకపోతే.. తాము అధికారంలోకి వచ్చామని చెబుతున్న బీజేపీ అదే నోటితో సమైక్యమన్న మాట ఎలా అనగలదు? బీజేపీ కూడా అన్ని రాజకీయ పార్టీల్లా దొంగ వైఖరి అవలంబిస్తోందా? కేవలం ఎన్నికల రాజకీయాల కోసమే సమైక్యమని అంటోందా?.. దీనికి ఎవరు సమాధానం చెప్పగలరు?
No comments:
Post a Comment