Death penalty to for maniac that killed 20 women with cyanide
ప్రేమ అని దగ్గరై.. పెళ్లి చేసుకుంటానని వారిని మోసం చేసి.. హఠాత్తుగా వారినే హత్య చేసే ఓ నరహంతకుడికి కోర్టు ఉరిశిక్ష విధించింది. మంగళూరులోని నాలుగో జిల్లా కోర్టు ఈ తీర్పు ప్రకటించింది. ఇతడు దాదాపు 20 మంది మహిళలను ఇలా ప్రేమ, పెళ్లి పేరుతో చంపేశాడు. నేర చరిత్రలోనే ఇది అత్యంత అరుదైన ఘటనగా న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. క్షమించేందుకు ఏ మాత్రం ఆస్కారం లేదన్నారు. విచారణ సమయంలో కోర్టును తప్పుదోవ పట్టించేందుకు యత్నించాడన్నారు.
మంగళూరుకు చెందిన మోహన్ కుమార్ మనస్తత్వ శాస్త్ర ఉపాధ్యాయుడు. అతడు అమాయక మహిళలను గుర్తించి వారికి చేరువయ్యేవాడు. తొలుత ప్రేమను నటించేవాడు. తర్వాత వివాహం చేసుకుని సమయం చూసి ఆమె వద్ద నగలు తీసుకొని సైనైడ్ పెట్టి చంపేసేవాడు. ఇలా ఇప్పటివరకు 20 మంది మహిళలను హతమార్చాడు. దక్షిణ కన్నడ, ఉడుపి జిల్లాల్లో మహిళలు అనుమానాస్పద స్థితిలో మరణించడంపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు మూడేళ్ల కిందట మోహన్ కుమార్ ను బంధించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. మూడు కేసుల్లో నేరం రుజువు కావడంతో కోర్టు ఉరిశిక్ష విధించింది. మరో 17 హత్య కేసులు ఇంకా విచారణలో ఉన్నాయి.
No comments:
Post a Comment