ప్రముఖ హాస్యనటుడు ధర్మవరపు సుబ్రమణ్యం(53) ఇక లేరు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శనివారం రాత్రి 10.30 గంటల సమయంలో దిల్ సుఖ్ నగర్ లోని ఆయన ఇంట్లో కన్నుమూశారు. దూరదర్శన్ లో ప్రసారమైన ఆనందో బ్రహ్మ సీరియల్ తో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న ధర్మవరపు.. బావాబావా పన్నీరు సినిమా ద్వారా వెండితెరకు పరిచమయ్యారు. వందలాది సినిమాల్లో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించారు. తోకలేనిపిట్ల అనే సినిమాకు దర్శకత్వం కూడా వహించారు. ప్రకాశం జిల్లా కొమ్మనేనివారి పాలెంలో జన్మించిన ధర్మవరపు సుబ్రమణ్యం.. తెలుగు సీనిపరిశ్రమలో తనకుంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆంధ్రప్రదేశ్ సాంస్క`తిక మండలి చైర్మన్ గా కూడా పనిచేశారు. ధర్మవరపు ఆకస్మిక మరణంతో సినీపరిశ్రమ దిగ్భ్రాంతికి గురైంది. పలువురు ప్రముఖులు ఆయన మరణం పట్ల సంతాపం ప్రకటించారు.
Tags: Actor Dharmavarapu died, Dharmavarapu Subramanyam news, Dharmavarapu photos, Dharmavarapu comedy
No comments:
Post a Comment