పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై మరో గాసిప్ గుప్పుమంది. ఆయన రాజకీయాల్లోకి వస్తున్నారంటూ గత కొంత కాలంగా ప్రచారం సాగుతున్న సంగతి తెలిసిందే. అయితే దీనిపై పవన్ ఎప్పుడూ పెదవి విప్పలేదు. ఓ దశలో పవన్, ఆయన సోదరుడు నాగబాబు తెలుగుదేశం పార్టీలోకి వెళ్తున్నారని జోరుగా ప్రచారం సాగింది. ఎప్పటిలాగే దీనిపై పవన్ స్పందించకపోవడంతో ఆయన అభిమానుల్లో గందరగోళం చోటుచేసుకుంది. దీంతో తాము ఏ పార్టీలోనూ చేరడంలేదని నాగబాబు పత్రికా ప్రకటన విడుదల చేయడంతో ఆ వదంతులకు పుల్ స్టాప్ పడింది. అయితే తాజాగా మరోసారి పవన్ రాజకీయ ప్రవేశంపై వదంతులు షికార్లు చేస్తున్నాయి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో సంచలన ఫలితాలు సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీలో పవన్ చేరతాడని, ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్ ఇన్ చార్జిగా పవర్ స్టార్ ఉంటాడని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయ్. సమాజానికి ఏదో చేయాలనే తపన ఉన్న పవన్.. ఆచరణలో మాత్రం ముందుకెళ్లలేకపోతున్నాడు. తెర వెనుక చేతనైన సాయం చేయడం తప్ప.. చేసిన సాయానికి ప్రచారం కూడా ఇష్టపడని పవన్ కళ్యాణ్.. అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతూ రాజకీయాల్లోకి వచ్చిన కేజ్రీవాల్ తో కలిస్తే చాలా బాగుంటుందని పలువురు విశ్లేషిస్తున్నారు. మరి పవన్ ఆమ్ ఆద్మీ పార్టీలో చేరతాడా లేదా అనేది కాలమే నిర్ణయిస్తుంది.
No comments:
Post a Comment