బాలీవుడ్ నటి శ్రీదేవి మళ్లీ తెలుగుతెరపై కనిపించబోతున్నారా? తన అభిమానులను మళ్లీ అలరించబోతున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇటీవల ఇంగ్లిష్ వింగ్లిష్ సినిమాలో కనువిందు చేసిన అతిలోక సుందరి తిరిగి తెలుగు సినిమాల్లో నటించే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం శ్రీదేవి పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిందనే కథనాలు గట్టిగా వినిపిస్తున్నాయి. సహారా గ్రూప్ కు భారీ మొత్తంలో బకాయిపడ్డట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో అప్పుల ఊబి నుంచి గట్టెక్కేందుకు ఇకపై పూర్తిస్థాయిలో సినిమాలపైనే పనిచేయాలని శ్రీదేవి నిర్ణయించుకున్నట్టు సమాచారం. ఇందులో భాగంగా తనకు విడదీయరాని అనుబంధం ఉన్న టాలీవుడ్ వైపు ఆమె చూస్తోందని తెలిసింది. తన కుమార్తెను హీరోయిన్ గా పరిచయం చేయాలని ఇన్నాళ్లూ భావించిన శ్రీదేవి.. తాజాగా ఆ ఆలోచనను పక్కనపెట్టి, తానే స్వయంగా రంగంలోకి దిగాలని యోచిస్తున్నారు. తెలుగు ప్రేక్షకుల్లో ఆమెకు ఇప్పటికీ అభిమానులు ఉండటం శ్రీదేవికి కలిసొచ్చే అంశం. అంతా అనుకున్నట్టు జరిగితే త్వరలోనే అతిలోక సుందరిని ఏ అత్త పాత్రలోనూ చూడటం తథ్యం.
No comments:
Post a Comment